ఆటో బోల్తా : ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-12-03T07:00:13+05:30 IST

బస్సును ఒవర్‌టేక్‌ చేసే క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది.

ఆటో బోల్తా : ఇద్దరికి గాయాలు

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు2:  బస్సును ఒవర్‌టేక్‌ చేసే క్రమంలో వేగాన్ని అదుపు చేయలేక ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. కొదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ఘనపురం స్టేజీ వద్ద గురువారం ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చిన్నఅడిశర్లపల్లికి చెందిన గడ్డం బుచ్చమ్మ, శ్రీరాములు దంపతులు పెద్దవూర మండలం సంగారం గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని, తిరుగు ప్రయాణంలో ఘనపురం గ్రామం స్టేజీ వద్దకు రాగానే ఆటో వేగాన్ని నియంత్రించే క్రమంలో బ్రేక్‌ వేయడంతో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తాకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే గుడిపల్లి పోలీసులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.

Updated Date - 2021-12-03T07:00:13+05:30 IST