నిరుపయోగంగా చెత్త సేకరణ ఆటోరిక్షాలు

ABN , First Publish Date - 2020-11-23T06:45:53+05:30 IST

స్వచ్ఛభారత్‌లో భాగంగా సఖినేటిపల్లి మండలం వీవీమెరక, మోరి పంచాయతీలకు తడి, పొడి చెత్త సేకరణకు రూ.లక్షల విలువైన ఆటో రిక్షాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది.

నిరుపయోగంగా చెత్త సేకరణ ఆటోరిక్షాలు
వీవీ మెరకలో నిరుపయోగంగా ఉన్న ఆటో రిక్షా

అంతర్వేది, నవంబరు 22: స్వచ్ఛభారత్‌లో భాగంగా సఖినేటిపల్లి మండలం వీవీమెరక, మోరి పంచాయతీలకు తడి, పొడి చెత్త సేకరణకు రూ.లక్షల విలువైన ఆటో రిక్షాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అయితే ఆటో రిక్షాలను పంచాయతీ సిబ్బంది వినియోగించకుండా మూలన పడేశారు. దీంతో  తుప్పు పట్టి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ నిరుపయోగంగా ఉన్నాయి. చెత్త సేకరణకు ఆటోరిక్షాలను ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-11-23T06:45:53+05:30 IST