వలంటీర్లకు అవార్డులు పంపిణీ
ABN , First Publish Date - 2021-04-16T06:17:48+05:30 IST
నియెజకవర్గంలోని 872 మంది వలంటీర్లకు ఉగాది పురస్కారాలను అందజేసినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు.
కొవ్వూరు, ఏప్రిల్ 15 : నియెజకవర్గంలోని 872 మంది వలంటీర్లకు ఉగాది పురస్కారాలను అందజేసినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు,తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు పట్టణ వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్స వం గురువారం ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 872 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర, సేవావజ్ర అవార్డులు రూ.90..2 లక్షల చెక్కులు అందజేశారు. వలంటీర్లను శాలువాతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ బావన రత్నకుమారి, వైస్చైర్మన్ మన్నె పద్మ, కమిషనర్ కెటి.సుధాకర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.