లోక్‌అదాలత్‌లో సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-10-25T04:40:13+05:30 IST

గ్రామస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు అన్నారు.

లోక్‌అదాలత్‌లో సమస్యల పరిష్కారం
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న న్యాయమూర్తి శరత్‌బాబు

కొవ్వూరు, అక్టోబరు 24: గ్రామస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు అన్నారు. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆదివారం నిర్వహించారు. గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులు నాణ్యతగా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాలన్నారు. ఇసుక సమస్య రాతపూర్వకంగా అందించాలన్నారు. అనంతరం చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ మేకల శ్రీనివాస్‌, న్యాయవాదులు, వై.ప్రకాశ్‌, డి.రవికుమార్‌, పీవీపీ.లక్ష్మి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:40:13+05:30 IST