ఓటరుగా నమోదు చేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-10-28T04:56:54+05:30 IST
విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ జీవీవీ.సత్యనారాయణ సూచించారు.
కామవరపుకోట, అక్టోబరు 27: విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ జీవీవీ.సత్యనారాయణ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ మోడల్ కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని, రాజ్యాంగంపై అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.నతానియేల్, వైస్ ప్రిన్సిపాల్ పి.నిర్మలకుమారి, అధ్యాపకులు కె.రవీంద్ర, డి.మల్లేష్, జి.శ్రీనివాసరావు, జి.రామ్మోహన్రావు, వి.శ్రీనివాస్, హర్షవర్ధిని, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.