చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2021-10-17T04:24:15+05:30 IST
విద్యార్థి దిశలోనే నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని జూనియర్ సివిల్ జడ్జి పి.బాబు అన్నారు.
తణుకు, అక్టోబరు 16: విద్యార్థి దిశలోనే నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని జూనియర్ సివిల్ జడ్జి పి.బాబు అన్నారు. శనివారం తణుకు తాలుకా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం పాతూరులోని గుడ్ సమరిటన్ చిల్ట్రన్హోంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, అజయకుమార్, న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, మల్లిపూడి జగజ్జీవన్ పాల్గొన్నారు