‘అయ్యన్నా! అరాచకత్వాన్ని కట్టిపెట్టు..’
ABN , First Publish Date - 2021-09-18T05:39:52+05:30 IST
టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ప్రభుత్వంపై చిందులు తొక్కితే ఎవరూ ఊరికే చూ స్తూ ఉండరని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యా లయంలో నరసన్నపేట నియోజవర్గ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
నరసన్నపేట: టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ప్రభుత్వంపై చిందులు తొక్కితే ఎవరూ ఊరికే చూ స్తూ ఉండరని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట నియోజవర్గ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడ్డారని, అలాంటి అక్రమాలు, రౌడీ యిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్డు తీర్పును టీడీపీ నేతలు తట్టుకోలేకపోతు న్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు పాల్గొన్నారు.