‘5 ఆగస్టు మార్గ్’గా బాబర్ రోడ్డు: గోయల్
ABN , First Publish Date - 2020-08-05T07:26:22+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ‘ఆగస్టు 5’న భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి
న్యూఢిల్లీ, ఆగస్టు 4: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ‘ఆగస్టు 5’న భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఢిల్లీలోని ‘బాబర్ రోడ్డు’ పేరును ‘5 ఆగస్టు మార్గ్’గా మార్చాలని బీజేపీ నేత విజయ్ గోయల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మద్దతుదారులతో కలిసి బాబర్ రోడ్డు పేరును ఈ విధంగా మారుస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ కూడా రాశారు.