పారదర్శకంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2020-12-05T05:48:05+05:30 IST
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన ఏపీ మినిస్టీరియల్ బ్యాక్లాగ్ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన ఏపీ మినిస్టీరియల్ బ్యాక్లాగ్ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 16వ తేదీన ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసిన వారి ప్రొవిజినల్ మెరిట్ జాబితా, అభ్యర్థుల అభ్యంతరాలు తెలియజేసేందుకు కలెక్టర్ కార్యాలయం, గుంటూరు జిల్లా వెబ్సైట్లో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విషయంలో దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.