బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా ప్రసాద్‌

ABN , First Publish Date - 2021-08-02T06:28:44+05:30 IST

బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా ప్రసాద్‌

బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా ప్రసాద్‌

గవర్నర్‌పేట, ఆగస్టు 1: బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా నగరానికి చెందిన ఎన్‌వీఎస్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఉత్తర్వులను సంఘం జాతీయ అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌కిరణ్‌ ఆదివారం ఓ హోటల్‌లో నిర్వహించిన సంఘ సమావేశంలో ప్రసాద్‌కు అందజేశారు. విభజిత ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ దాని మిత్రపక్షం జనసేన రాష్ట్రంపై కపటప్రేమ చూపుతున్నాయని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని లేకుంటే కాంగ్రెస్‌ పార్టీకి పట్టినగతే బీజేపీ, జనసేనకు పడుతుందని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-02T06:28:44+05:30 IST