చట్టాలపై అవగాహన కలిగించాలి
ABN , First Publish Date - 2021-10-17T05:23:06+05:30 IST
చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ డిజ్జ శివప్రసాద్యాదవ్ పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 16 : చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ డిజ్జ శివప్రసాద్యాదవ్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురష్కరించుకుని స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యా యవిజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జితోపాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి రత్నకుమార్లు జూమ్ యాప్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ముడిమెల కొండారెడ్డి, న్యాయవాది రమే్షకుమార్, పాఠశాల హెచ్ఎం గుర్రప్ప,, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మలమడుగులో..
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 16: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జమ్మలమడుగు జూనియర్ సివిల్జడ్జి బాబాఫకృద్దీన్ సూచించారు. శనివారం పట్టణంలోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సులు ఏ ర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్రెడ్డి, సుబ్బారెడి ్డ, భాస్కర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, స్థానికులు పాల్గొన్నారు.