సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-08-27T06:12:51+05:30 IST
విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీజీపీ వై నాగిరెడ్డి అన్నారు. ఎ
- అడిషనల్ డీజీపీ వై నాగిరెడ్డి
కరీంనగర్ క్రైం, ఆగస్టు 26: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీజీపీ వై నాగిరెడ్డి అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. శుక్రవారం నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. అడిషనల్ డీసీపీ(ఎల్అండ్ఓ) ఎస్ శ్రీనివాస్, ఏసీపీ తుల శ్రీనివాస్రావు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పోలీస్స్టేషన్ ఆవరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. వివిధ రకాల ఆందోళనల సందర్భంగా పరిసర ప్రాంతాలను గమనించా లని చెప్పారు. అకస్మాత్తుగా దాడులు జరిగిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల పనివిభాగాల గురించి అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు కమిషనర్ వి సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ(ఎల్అండ్ఓ) ఎస్ శ్రీనివాస్, ఏసీపీ తుల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ నటేశ్ తదితరులు పాల్గొన్నారు.