వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-06-04T09:54:31+05:30 IST
వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక అన్నారు
హుజూరాబాద్, జూన్ 3: వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక అన్నారు. బుధవారం పట్టణంలోని 12వార్డులో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాలీ ఆటోలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.
హుజూరాబాద్ రూరల్: రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల పేరిటా గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు.