అత్యంత కీలక భేటీకి డుమ్మా కొట్టనున్న దీదీ?

ABN , First Publish Date - 2021-03-17T16:55:31+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.

అత్యంత కీలక భేటీకి డుమ్మా కొట్టనున్న దీదీ?

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ కరోనాను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను మోదీ అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రాబోయే రోజుల్లో ఏఏ చర్యలు చేపడితే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ వివరించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రస్తావన కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వర్చువల్ మీట్‌కు గైర్హాజర్ అవుతారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమెకు బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవుతారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్న కారణంగానే రాలేకపోతున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-03-17T16:55:31+05:30 IST