బెంగళూరు హింసాకాండ కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-14T15:17:46+05:30 IST

బెంగళూరులో జరిగిన హింసాకాండ కేసులో నిందితుడైన బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు కలీంపాషాను పోలీసులు అరెస్టు....

బెంగళూరు హింసాకాండ కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్

బెంగళూరు (కర్ణాటక): బెంగళూరులో జరిగిన హింసాకాండ కేసులో నిందితుడైన బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు కలీంపాషాను పోలీసులు అరెస్టు చేశారు. కలీంపాషా కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్ కు సన్నిహితుడని పోలీసులు చెప్పారు. హింసాకాండ కేసులో నిందితుడైన కలీంపాషా మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఉన్న చిత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో బెంగళూరు హింసాకాండను మాజీ సీఎం సిద్ధరామయ్య ఖండించలేదని బీజేపీ నాయకుడు సంతోష్ ఆరోపించారు. బెంగళూరు హింసాకాండ కేసులో 60 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. 206 మందిని అదుపులోకి తీసుకున్నామని పాటిల్ పేర్కొన్నారు.ఈ కేసును నాలుగు బృందాలు దర్యాప్తు చేసి నిందితులైన ఎస్‌డీపీఐ సభ్యులను అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-14T15:17:46+05:30 IST