ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
ABN , First Publish Date - 2021-06-22T05:51:20+05:30 IST
ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ పి.కోమలి తెలిపారు.
కడియం, జూన్ 21: ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ పి.కోమలి తెలిపారు. సోమవారం కడియం విచ్చేసిన ఆమె మండలంలో జరుగుతున్న ఫీవర్ సర్వేలో భాగంగా కడియంలో జరుగుతున్న సర్వేతో పాటు ఇటీవల బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వైద్యసేవలు పొంది ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న వ్యక్తిని పరిశీలించారు. ఆరోగ్య విషయాలపై ఆరా తీసారు. ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలుగుబంటి రఘురామ్(నాని), వనుం సూరిబాబు, హెచ్వీ రమాదేవి, సచివాలయ ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.