భూములు లాక్కుంటే వీధిన పడతాం..

ABN , First Publish Date - 2021-07-24T03:20:31+05:30 IST

ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగు చేసుకుంటూ 40 ఏళ్లుగా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆ భూమలు లాక్కుంటే వీధిన పడతామని ఉత్తమనెల్లూరు, ఇల్లకూరుపాడు గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీలు శుక్రవారం తహసీల్దారు పద్మావతి కి మొరపెట్టుకున్నారు.

భూములు లాక్కుంటే వీధిన పడతాం..
తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉత్తమనెల్లూరు, ఇల్లకూరుపాడు గ్రామస్థులు

దళితులు, బీసీల ఆవేదన

కోట, జూలై 23 : ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగు చేసుకుంటూ 40 ఏళ్లుగా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆ భూమలు లాక్కుంటే వీధిన పడతామని   ఉత్తమనెల్లూరు, ఇల్లకూరుపాడు గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీలు శుక్రవారం తహసీల్దారు పద్మావతి కి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుచ్చలపల్లిలోని జమ్మలమిట్ట చెరువులో 1976లో సుమారు 65 మందికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు.  ఆ భూములను చదునుచేసుకొని సాగు చేసుకుంటుండగా హఠాత్తుగా ఆ భూములు వదిలివెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కలెక్టర్‌కు పంపి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-07-24T03:20:31+05:30 IST