ఎక్సైజ్ నేరాలలో నిందితుల బైండోవర్
ABN , First Publish Date - 2020-05-23T10:16:55+05:30 IST
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు వివిధ ఎక్సైజ్ నేరాలలో నిందితులుగా ఉన్న 13 మంది
కడెం, మే 22: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు వివిధ ఎక్సైజ్ నేరాలలో నిందితులుగా ఉన్న 13 మంది వ్యక్తులను తహసీల్దార్ నరేందర్ ఎదుట బైండోవర్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 110 కింద సత్ప్రవర్తన కలిగి ఉండేలా, మరలా ఎలాంటి నేరా లు చేయకుండా ఉండాలని, తిరిగి మరలా నేరాలకు పాల్పడితే లక్షా రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీన్ కుమార్, శిక్షణ ఎస్సైలు సులోచన, రమేష్, సిబ్బంది నరేష్, ప్రకాష్, నిరోషా, మహేష్, దినేష్ ఉన్నారు.