మహానందిలో ఆదిశంకరుల జయంతి
ABN , First Publish Date - 2021-05-18T05:36:43+05:30 IST
మహానంది శైవ క్షేత్రంలో ఆదిశంకర జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది, మే 17: మహానంది శైవ క్షేత్రంలో ఆదిశంకర జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటపంలో ఆదిశంకరులు చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రవిశంకర్అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్ వేదమంత్రాలతో విశేష రుద్రాభిషేకం, ఉపచారపూజలను జరిపారు.