ఎమ్మెల్యే అనుమానాస్పద మృతిపై గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-07-14T02:23:36+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే తన గ్రామానికి సమీపంలోని బిందాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన ఉరి వేసుకున్నట్లుగా మెడకు తాడు ఉంది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను హత్య చేశారని ఆరోపించింది.

ఎమ్మెల్యే అనుమానాస్పద మృతిపై గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతిపై బీజేపీ నేతల బృందం పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలిసింది. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ బృందానికి నేతృత్వం వహించిన పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో తీయాలని కోరారు.


బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ తన గ్రామానికి సమీపంలోని బిందాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన ఉరి వేసుకున్నట్లుగా మెడకు తాడు ఉంది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్యేను హత్య చేశారని ఆరోపించింది. మమత పాలనలో హింస పరాకాష్టకు చేరిందని బీజేపీ ఆరోపించింది. 


బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ అనుమానాస్పద మృతికి నిరసనగా మంగళవారం ఉత్తర పశ్చిమబెంగాల్ బంద్ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. 



Updated Date - 2020-07-14T02:23:36+05:30 IST