బీజేపీ-జేడీయూ కూటమి సూపర్హిట్!
ABN , First Publish Date - 2020-10-22T07:54:59+05:30 IST
బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. బీజేపీ-జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్టు పార్టీల మహాఘట్బంధన్, ఎల్జేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి...
- సచిన్-సెహ్వాగ్ మాదిరిగా విజృంభిస్తాం... బిహార్ ప్రచారంలో రాజ్నాథ్
పట్నా, అక్టోబరు 21: బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. బీజేపీ-జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్టు పార్టీల మహాఘట్బంధన్, ఎల్జేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. భాగల్పూర్ జిల్లాలో బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. కూటమి దూకుడు మామూలుగా ఉండబోదని, క్రికెట్లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ల ఓపెనింగ్ పెయిర్లా సూపర్హిట్ అవుతుందని రాజ్నాథ్ అన్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై ఓ వికలాంగుడు చెప్పులు విసిరాడు. ఒక చెప్పు దూరంగా పడగా, మరొకటి తేజస్వి ఒళ్లో పడింది.