బీజేపీ నాయకుడిపై మంత్రి గంగుల ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-08-08T01:20:20+05:30 IST
తనకు సంబంధంలేని వ్యవహారంలో తన పరువుతీసే విధంగా సామాజిక మాద్యమాల్లో, పత్రికలు
కరీంనగర్: తనకు సంబంధంలేని వ్యవహారంలో తన పరువుతీసే విధంగా సామాజిక మాద్యమాల్లో, పత్రికలు, ఛానల్స్లో ప్రకటనలు చేస్తూ అసత్య ప్రచారం చేసిన బీజేపీ కరీంనగర్ మాజీ అధ్యక్షుడు బేతి మహేందర్రెడ్డిపై రాష్ట్ర పౌరసరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి బేతి మహేందర్రెడ్డిపై కరీంనగర్ రెండో ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ కింద ఐపీసీ 153ఏ, 505(2) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.