డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజీపీ నాయకుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-12-06T03:48:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆదివారంమండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజీపీ నాయకుల రాస్తారోకో
కెరమెరిలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

కెరమెరి, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆదివారంమండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర ఆత్మారాంనాయక్‌, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. వెంటనే రేట్లు తగ్గించాలని, అప్పటి వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు. నాయకులు వెంకట్‌గౌడ్‌, శ్రీకాంత్‌, వేణు, నవీన్‌, భీంరావు, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T03:48:59+05:30 IST