బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-08T05:02:26+05:30 IST

మహారాష్ట్రలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందనీ..

బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

పుణే: మహారాష్ట్రలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందనీ.. ప్రస్తుతం తన ఇంట్లోనే స్వీయనిర్బంధంలో  ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ తెలిపారు. ప్రస్తుతం పుణే నగరంలోని కాస్బా నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. తనకు, తన తల్లికి ఇన్ఫెక్షన్ సోకిందనీ.. అయితే కరోనా లక్షణాలేవీ తమలో లేవని తిలక్ పేర్కొన్నారు. ‘‘ఇవాళ నాకు, నా తల్లికి కరోనా పాజిటివ్ వున్నట్టు పరీక్షల్లో తేలింది. అయితే మాలో కరోనా లక్షణాలేవి లేవు. వైద్యుల సూచనల మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉండి స్వీయ నిర్బంధం విధించుకున్నాం..’’ అని తిలక్ ట్వీట్ చేశారు. తమ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరికీ కొవిడ్-19 లేదని నిర్థారణ అయ్యిందన్నారు.




Updated Date - 2020-07-08T05:02:26+05:30 IST