కరోనా నివారణకు కర్ణాటక ఎమ్మెల్యే ప్రత్యేక పూజ

ABN , First Publish Date - 2020-06-01T23:05:12+05:30 IST

ప్రస్తుతం కర్ణాటకలో మూడు వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇందులో యాక్టివ్ కేసులు రెండు వేలు ఉన్నాయి. దేశంలో కరోనా విస్తృతి అధికంగా ఉన్నప్పటికీ కర్ణాటకలో ప్రభావం చాలా తక్కువగానే ఉంది

కరోనా నివారణకు కర్ణాటక ఎమ్మెల్యే ప్రత్యేక పూజ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య కోవిడ్-19 నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హెరికల్మతలో సోమవారం ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విస్తృతి రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పూజకు ప్రాధాన్యత సంతరించుకుంది.


‘‘వ్యాధి సోకిన వారి శ్రేయస్సు కోసం నవ గ్రహ పూజ కూడా జరిగింది. పూజకు హాజరైన వారు భౌతిక దూర ప్రమాణాలను పాటించారు. వారి ముఖాలపై మాస్కులు ధరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పూజలు నిర్వహించాం’’ అని రేణుకాచార్య తెలిపారు.


ప్రస్తుతం కర్ణాటకలో మూడు వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇందులో యాక్టివ్ కేసులు రెండు వేలు ఉన్నాయి. దేశంలో కరోనా విస్తృతి అధికంగా ఉన్నప్పటికీ కర్ణాటకలో ప్రభావం చాలా తక్కువగానే ఉంది. అయితే కొద్ది రోజులుగా కర్ణాటకలో సైతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

Updated Date - 2020-06-01T23:05:12+05:30 IST