బీజేపీ నాయకురాలిపై అత్యాచారం.. నిందితుడు ఎవరంటే?..
ABN , First Publish Date - 2022-01-07T07:48:54+05:30 IST
దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బిజేపీ)కి చెందిన ఒక మహిళ మండలి నాయకురాలు తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు మత్తు పానీయం ఇచ్చాడని.. తాను స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేసి అదే సమయంలో వీడియో రికార్డ్...
దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బిజేపీ)కి చెందిన ఒక మహిళ మండలి నాయకురాలు తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు మత్తు పానీయం ఇచ్చాడని.. తాను స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేసి అదే సమయంలో వీడియో రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆమె ఫిర్యాదుపై విచారణ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాన్పూర్ నగర బిజేపీ నాయకురాలు తనపై అత్యాచారం జరిగిందంటూ డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్ బిజేపీ మహిళా మండలి నాయకురాలు తన సమీప బంధువుతో కలిసి జిల్లా పరిధిలోని అక్బర్పురా గ్రామానికి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్లారు. కార్యక్రమం పూర్తి కాగానే.. ఆమెకు తలనొప్పిగా ఉండడంతో నిందితుడు సమీపంలోని ఒక లాడ్జికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ తలనొప్పి మాత్రలకు బదులు.. మత్తు మందు ఇచ్చాడు. దీంతో బిజేపీ నాయకురాలు స్పృహ కోల్పోయింది. ఆ స్థితిలో ఆమెపై నిందితుడు అత్చాచారం చేసి.. ఒక వీడియో రికార్డ్ చేశాడు.
కాసేపు తరువాత స్పృహలోకి వచ్చిన నాయకురాలు తన శరీరంపై బట్టలు లేకపోవడంతో జరిగింది తెలుసుకొని బాధపడింది. అత్యాచారం చేశాక నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తరువాత నిందితుడు ఆమెకు ఫోన్ చేసి కొంత డబ్బులు ఇవ్వమని అడిగాడు. లేకపోతే ఆమె నగ్నంగా ఉన్న వీడియో వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అతని బెదిరింపులకు భయపడి పరువు కాపాడుకునేందుకు ఆమె నిందితుడికి రూ.2.5 లక్షలు ఇచ్చింది. కానీ ఇంతటితో అతను ఆగలేదు.. డబ్బు కోసం మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి ఆమె ఇవ్వకపోవడంతో.. అతను ఆమె ఇద్దరు కూతుర్లపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు.
నిందితుడు హింసకు పాల్పడే అవకాశముండడంతో ఆ బిజేపీ నాయకురాలు పోలీసులను ఆశ్రయించింది. తన కూతుర్లను కాపాడి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.