నా ప్రాణాలకు ముప్పు ఉంది..బీజేవైఎం నాయకురాలు పమేలా గోస్వామి ఆరోపణ

ABN , First Publish Date - 2021-03-05T16:18:39+05:30 IST

డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న తన ప్రాణాలకు ముప్పు ఉందని బీజేవైఎం బెంగాల్ నాయకురాలు పమేలా గోస్వామి ఆరోపించారు....

నా ప్రాణాలకు ముప్పు ఉంది..బీజేవైఎం నాయకురాలు పమేలా గోస్వామి ఆరోపణ

కోల్‌కతా: డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న తన ప్రాణాలకు ముప్పు ఉందని బీజేవైఎం బెంగాల్ నాయకురాలు పమేలా గోస్వామి ఆరోపించారు. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్ ను ఎస్డీపీఎస్ కోర్టు తిరస్కరించి, మార్చి 18వతేదీ వరకు పోలీసు కస్టడీని పొడిగించిన నేపథ్యంలో పమేలా గోస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.తనతోపాటు తన స్నేహితుడు ప్రబీర్ కూడా ప్రాణభయం ఉందని ఆమె పేర్కొన్నారు. తనను,తన స్నేహితుడు ప్రబీర్ ను జైలులో చంపేస్తానని రాకేశ్ సింగ్ బెదిరించాడని, దీని రుజువును జాయింట్ పోలీసు కమిషనరుకు ఇచ్చానని పమేలా వివరించారు. తనకు న్యాయం చేయాలని కోర్టు నుంచి జైలుకు వెళుతూ పమేలా వ్యాఖ్యానించారు.పమేలా కారులో కొకైన్ సంచులను కోల్‌కతా పోలీసులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.  


Updated Date - 2021-03-05T16:18:39+05:30 IST