నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న బీజేవైఎం నాయకులు
ABN , First Publish Date - 2021-02-24T04:53:09+05:30 IST
జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కామారెడ్డి టౌన్/బాన్సువాడ టౌన్, మద్నూర్, ఫిబ్రవరి 23: జిల్లా వ్యాప్తంగా మంగళవారం బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా ఆయనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద, బాన్సువాడ, మద్నూర్ లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేవైఎం నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో కలిసి ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెంటనే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిని విడుదల చేయాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శులు సంజీవరెడ్డి, శివకుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు నంది వేణు, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఉపాధ్యక్షుడు సాయికాంత్, లింగం, శరత్, శ్రీకాంత్, రాజేష్, భరత్, సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, రాజాసింగ్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మద్నూర్లో బీజేవైఎం నాయకులు కృష్ణ పటేల్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.