డీసీసీ అధ్యక్షురాలిగా బొడ్డేపల్లి సత్యవతి

ABN , First Publish Date - 2020-02-23T07:41:20+05:30 IST

డీసీసీ అధ్యక్షురాలిగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, ఆమదాల వలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి

డీసీసీ అధ్యక్షురాలిగా బొడ్డేపల్లి సత్యవతి

ఆమదాలవలస, ఫిబ్రవరి 22: డీసీసీ అధ్యక్షురాలిగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, ఆమదాల వలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి రెండోసారి నియమితుల య్యారు. ఈ మేరకు  పీసీసీ అధ్య క్షుడు సాకే శైలజా నాథ్‌ ఆమె నియా మకాన్ని ప్రకంటించారు. 30 ఏళ్లపాటు సుదీర్ఘకాలం ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసు రాలిగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.  1995 నుండి 2004 వరకూ ఆమదాలవలస పురపాలక సం ఘం చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వర కూ ఎమ్మె ల్యేగా కొనసాగారు. ఎమ్మెల్యేగా ఉం టూనే  2005 నుంచి 2008 వరకూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షు రాలిగా వ్యవహ రించారు.  2019 ఎన్నికల్లో ఆమదా ల వలస నుంచి కాంగ్రెస్‌ అభ్య ర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. చాలా మం ది నాయకులు కాంగ్రెస్‌ను వీడినా.. సత్య వతి మాత్రం పార్టీ విధేయురాలిగా కొన సాగుతూ వస్తున్నారు. అందుకే డీసీసీ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. 

Updated Date - 2020-02-23T07:41:20+05:30 IST