60 లక్షల మంది కార్మికులను వైసీపీ మోసం చేసింది: బోండా ఉమ

ABN , First Publish Date - 2021-09-12T16:33:34+05:30 IST

భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం మోసం చేయటం దుర్మార్గమని బోండా ఉమ విమర్శించారు.

60 లక్షల మంది కార్మికులను వైసీపీ మోసం చేసింది: బోండా ఉమ

విజయవాడ: భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం మోసం చేయటం దుర్మార్గమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయిలను వైసీపీ కార్మికుల సంక్షేమ నిధి నుంచి లెక్కలు లేకుండా తప్పించిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల నిధుల గోల్ మాల్‌పై కేంద్రం సరైన విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కంచె చేను మేస్తే ఇక కార్మికులకు దిక్కెవరని ప్రశ్నించారు. 60 లక్షల మంది కార్మికులను వైసీపీ మోసం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులు వుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులకు రూ. 10 వేలు ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ పోరాడుతుందని బోండా ఉమ స్పష్టం చేశారు.              


Updated Date - 2021-09-12T16:33:34+05:30 IST