బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం
ABN , First Publish Date - 2021-03-03T12:33:10+05:30 IST
బ్రెజిల్ దేశంలో రెండో విడత ప్రబలిన కరోనా మరణ మృదంగం సృష్టిస్తోంది.
ఒక్కరోజే 1641 మంది మృతి
బ్రెజిలియా (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో రెండో విడత ప్రబలిన కరోనా మరణ మృదంగం సృష్టిస్తోంది. బ్రెజిల్ దేశంలో మంగళవారం ఒక్కరోజే 1641 మంది కరోనాతో మరణించారని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచంలోనే అమెరికా తర్వాత బ్రెజిల్ దేశంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. బ్రెజిల్ దేశంలో మొత్తం 212 మిలియన్ల నివాస ప్రాంతాల్లో 2,57,361 మంది కరోనాతో మరణించారని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కట్టడికి బ్రెజిల్ దేశంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని పలు నగరాల్లో కరోనా కొత్త ఆంక్షలు విధించారు. బ్రెజిల్ లోని ప్రజలకు జనవరి 15వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం చేపట్టినా కరోనా మాత్రం అదుపులోకి రాలేదు.