బీఎస్ఆర్సీ.. 8 మాసాలకే బీజేపీలో విలీనం
ABN , First Publish Date - 2020-05-27T07:02:04+05:30 IST
బీఎస్ఆర్సీ.. 8 మాసాలకే బీజేపీలో విలీనం
2011లో గాలి జనార్దన్రెడ్డి డైరెక్షన్లో ప్రస్తుత మంత్రి శ్రీరాములు ‘బడవర శ్రామికర రైతర కాంగ్రెస్ పార్టీ (బీఎస్ఆర్సీ)’ని స్థాపించారు. జనార్దన్రెడ్డి జైలుపాలైన తర్వాత పార్టీని నడపలేక 8 నెలలకే బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. జనార్దన్రెడ్డికి, ఆయన అనుచరులకు ప్రాధాన్యం తగ్గింది. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టి 10-15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే రాజకీయంగా చక్రం తిప్పవచ్చని గాలి జనార్దన్రెడ్డి ఆలోచిస్తున్నట్లు అంటున్నారు. దీనిపై ఆయన సోదరుడు, బళ్లారి సిటీ ఎమ్మెల్యే సోమశేఖర్రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. నవ్వుతూ దాటవేశారు.