బడ్జెట్ 2022 ప్రసంగం ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-01T16:42:27+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం నిర్మలా బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నామని, మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఇక ఈ బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి.