భవన సముదాయాన్ని సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2022-06-14T06:20:17+05:30 IST
పోలీసు కార్యాలయాల భవన సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు.
సిరిసిల్ల క్రైం, జూన్ 13: పోలీసు కార్యాలయాల భవన సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన సముదాయ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రాచారి, రవికుమార్, ఏఈ రాజశేఖర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.