సీఏ మే దశ పరీక్షలు రద్దు: ఐసీఏఐ

ABN , First Publish Date - 2020-07-14T06:45:41+05:30 IST

కరోనా పరిస్థితుల దృష్ట్యా జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకు జరగాల్సిన సీఏ మే దశ పరీక్షలను రద్దు చేసినట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది...

సీఏ మే దశ పరీక్షలు రద్దు: ఐసీఏఐ

న్యూఢిల్లీ, జూలై 13: కరోనా పరిస్థితుల దృష్ట్యా జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకు జరగాల్సిన సీఏ మే దశ పరీక్షలను రద్దు చేసినట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది. వీటిని నవంబరు దశతో కలిపి నిర్వహిస్తామని పేర్కొంది. గత నెలలో ఐసీఏఐ మే దశ నుంచి తప్పుకొని నవంబరు దశ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా విద్యార్థులకు అప్ట్‌ అవుట్‌ ఆప్షన్‌ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇండియన్‌ వైడ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఖాన్విల్కర్‌, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది.  


Updated Date - 2020-07-14T06:45:41+05:30 IST