తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం కళేబరం.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2020-05-24T03:10:35+05:30 IST

40 అడుగుల పొడవున్న ఓ భారీ తిమింగలం కళేబరం ఒడిశా తీరానికి...

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం కళేబరం.. ఎక్కడంటే..

భువనేశ్వర్: 40 అడుగుల పొడవున్న ఓ భారీ తిమింగలం కళేబరం ఒడిశా తీరానికి కొట్టుకొచ్చింది. దీనిపై స్థానిక అటవీ శాఖాధికారి మాట్లాడుతూ, కేంద్రపారా జిల్లాలో ఉన్న గమిర్మత మరీన్ శాంక్చువరీ ప్రాంతంలోని సముద్ర తీరానికి ఈ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చిందని చెప్పారు. దీని పొడవు 40 అడుగుల ఉందని, దాదాపు 10 టన్నుల వరకు బరువుందని తెలిపారు. ఈ రకం తిమింగలాలు  అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే దీని శరీరంపై గాయాలు ఉండడంతో పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని, తద్వారా మరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-05-24T03:10:35+05:30 IST