విద్యార్థులకు కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2021-04-20T03:40:07+05:30 IST
: మండలంలోని పలు పాఠశాలల్లో సోమవారం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది క
బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్19: మండలంలోని పలు పాఠశాలల్లో సోమవారం పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. బుచ్చి డీఎల్ఎన్ఆర్ హైస్కూల్లో 18మంది ఉపాధ్యాయులు, మిడ్డే మీల్, శానిటరీ వర్కర్లకు, 22 మంది విద్యార్థులకు, ఇస్కపాళెం, వడ్డిపాళెంలలో 8 మంది ఉపాధ్యాయులు, 45మంది విద్యార్థులకు 8మంది ఉపాధ్యాయులు, రేబాల గిరిజన కాలనీ స్కూల్లో ఐదుగురు టీచర్లు, 32మంది విద్యార్థుకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈవో దిలీప్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.