నిబంధనలు గాలికి... ఈ ‘క్యూ’ మద్యానికి!
ABN , First Publish Date - 2020-08-05T10:51:26+05:30 IST
ల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే స్థాయిలో మరణాలూ నమోదవుతున్నాయి.
విజయనగరం: జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే స్థాయిలో మరణాలూ నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా కాటు నుంచి తప్పించుకోవచ్చని అధికారులు పదే పదే చెబుతున్నారు. అయినా మందుబాబులకు మాత్రం అదేమీ పట్టడం లేదు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఓ వైపు ప్రజలు భయపడుతున్నా... మాకేమీ భయం లేదన్నట్టుగా మందుబాబులు మద్యం కోసం బారులు తీరుతున్నారు. అదీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా. మంగళవారం ఉదయం విజయనగరం రింగురోడ్డు జంక్షన్లోని ఓ వైన్షాపు వద్ద మద్యం కోసం ఒకరినొకరు నెట్టుకుంటూ భౌతికదూరం గాలికి వదిలేసి... ఇలా బారులు తీరారు.