ఇందుకూరుపేటలో కరోనా ఉధృతి
ABN , First Publish Date - 2021-04-20T03:47:11+05:30 IST
మండలంలో వారం నుంచి కరోనా ఉధృతి పెరిగింది. పీడీకండ్రిగలో సోమవారం ఆరుగురు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయు
ఇందుకూరుపేట, ఏప్రిల్ 19 : మండలంలో వారం నుంచి కరోనా ఉధృతి పెరిగింది. పీడీకండ్రిగలో సోమవారం ఆరుగురు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆ పాఠశాలను మూయించేశారు. అలాగే ప ల్లిపాడు, ఆదెమ్మసత్రం, మైపాడు, కొరుటూరు, పట్టపుపాళెం, నరసాపురం, తదితర గ్రామ పాఠశాలల్లో కూడా ఉపా ధ్యాయులకు కరోనా సోకింది. కొరుటూరులో కూడా విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆ పాఠశాలకు తాళం వేశారు.ఈ విషయంపై ఎంఈవో శ్రీహరివాబు మాట్లాడుతూ కరోనా ఉధృతిని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.