బీజేపీ శ్రేణుల సంబరాలు
ABN , First Publish Date - 2022-03-11T05:29:31+05:30 IST
ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో బీజేపీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ గురువారం గోదావరిఖని చౌరస్తాలో బీ జేపీ నగర అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ ఆధ్వ ర్యంలో సంబరాలు నిర్వహించారు.
కళ్యాణ్నగర్, మార్చి 10: ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో బీజేపీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ గురువారం గోదావరిఖని చౌరస్తాలో బీ జేపీ నగర అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ ఆధ్వ ర్యంలో సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్టీసీ మాజీ చైర్మన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సో మారపు సత్యనారాయణ హాజరై బాణాసంచా కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ నే తృత్వంలో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రావుల రాజేందర్, మంచికట్ల బిక్షపతి, పల్లికొండ నర్సింగ్, తడగొండ నర్సయ్య, చంద్రశేఖర్, రాజు, సత్యం,దేవేందర్, సందీప్, చుక్కల రాములు, డేవిడ్ రాజ్, బండి రాము, సతీష్, మాతంగిరేణుక, బీజేపీ మహిళా మోర్చా నాయకురా లు సోమారపు లావణ్య, అరుణ్కుమార్, వెంకటస్వా మి, పిడుగు కృష్ణ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు మామిడి రాజేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందాన్ని హర్షిస్తూ గోదావరిఖని చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోగుల రవీందర్రెడ్డి, దిగుట్ల లింగయ్య, కొండపర్తి సం జీవ్, మామిడి సంపత్, వడ్డేపల్లి సదానందం, గట్ట య్య, మల్లిక్, పాక శంకర్ పాల్గొన్నారు.