నేడు, రేపు ఏపీలో కేంద్ర మంత్రి Kishan reddy పర్యటన
ABN , First Publish Date - 2021-08-18T14:34:11+05:30 IST
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
విజయవాడ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో జరుగనున్న జన ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. కేబినెట్లో ప్రమోషన్ పొందిన కేంద్ర మంత్రుల పర్యటనల్లో భాగంగా జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంటకు కిషన్ రెడ్డి రానున్నారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల స్వాగత ర్యాలీ, మీటింగ్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో వ్యాక్సిన్ సెంటర్ను కేంద్రమంత్రి సందర్శించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరంకు కిషన్ రెడ్డి రానున్నారు. దుర్గ గుడిలో అమ్మవారి దర్శనంతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు.