విద్యా సంవత్సరం నష్టపోకూడదనే..

ABN , First Publish Date - 2020-08-14T06:48:01+05:30 IST

విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో పరీక్షల నిర్వహణకు యూజీసీకి అనుమతిని ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర హోం శాఖ గురువారం తెలిపింది...

విద్యా సంవత్సరం నష్టపోకూడదనే..

  • యూజీసీకి అనుమతిపై సుప్రీం కోర్టులో కేంద్రం 

న్యూఢిల్లీ, ఆగస్టు 13: విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో పరీక్షల నిర్వహణకు యూజీసీకి అనుమతిని ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర హోం శాఖ గురువారం తెలిపింది.  కేంద్ర మానవ వనరుల శాఖ అభ్యర్థన, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకే సెప్టెంబరు 30లోగా పరీక్షలు నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ  ఆదేశాలు జారీ చేసిందని చెప్పింది.


అసోం, బీహార్‌, కర్నాటక, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన  కొందరు విద్యార్థులు యూజీసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా యూజీసీ సమాధానమిస్తూ యూనివర్సిటీ పరీక్షలను రద్దు చేసే  ప్రసక్తే లేదని  స్పష్టం చేసింది. పరీక్షలను రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టుకు విన్నవించింది. 


Updated Date - 2020-08-14T06:48:01+05:30 IST