ఎమ్మెల్యేను సన్మానించిన సహకార సంఘాల చైర్మన్లు

ABN , First Publish Date - 2021-04-19T06:14:58+05:30 IST

మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావే శాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిని సహకార సంఘాల చైర్మన్లు సన్మానించారు.

ఎమ్మెల్యేను సన్మానించిన సహకార సంఘాల చైర్మన్లు
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని సన్మానిస్తున్న సింగిల్‌విండో చైర్మన్లు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావే శాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిని సహకార సంఘాల చైర్మన్లు సన్మానించారు. ఆదివారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైర్మన్లు ఎమ్మెల్యేకు పూలదండ వేసి శాలువా కప్పి సన్మా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశా ల్లో చైర్మన్లు క్రమంతప్పకుండా పాల్గొని రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుక పోయి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సహకార సంఘాల చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్‌, దాసరి చంద్రారెడ్డి, మోహన్‌రావు, ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, గజవెల్లి పురుషోత్తం, మాదిరెడ్డి నర్సింహారెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T06:14:58+05:30 IST