జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-08-20T01:20:14+05:30 IST

జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా అభిప్రాయపడ్డారు.

జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. ఈ సవాళ్లు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రక్షణరంగంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ 5.0 కార్యక్రమాన్ని మంత్రి గురువారం నాడు ప్రారంభించారు. కొత్త భద్రతాసవాళ్లు పుట్టుకొస్తున్న కారణంగా భారత్.. రక్షణరంగంలో స్వావలంబన సాధించాలని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్ పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-08-20T01:20:14+05:30 IST