చంద్రబాబు, లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-21T05:00:30+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని గురువారం శివాజీపాలెం షిర్డీసాయిబాబా ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మద్దిలపాలెం, జనవరి 20: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని గురువారం శివాజీపాలెం షిర్డీసాయిబాబా ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం బయట కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బొట్టా వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్లు కొవిడ్ బారిన పడడం దురదృష్టకరమన్నారు. వారి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షుడు ఒమ్మి అప్పారావు, డొక్కర శ్రీను, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.