చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-21T04:23:26+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు కొండపిలోని శ్రీసాయిబాబా ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు.
కొండపి, జనవరి 20 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు కొండపిలోని శ్రీసాయిబాబా ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. మండల మాజీ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుసూదనరావు, టీడీపీ కొండపి పట్టణ నాయకుడు నన్నూరి సుబ్బారామయ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్ కాలేషా, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దేపూరి మస్తాన్ పాల్గొన్నారు.