రేషన్‌షాపుల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-19T05:56:27+05:30 IST

మండలంలోని కుదాభక్షుప ల్లి, శివన్నగూడ, ఎరుగండ్లపల్లి, మర్రిగూడ గ్రామాల్లో రేషన్‌ షాపులను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు చేశారు.

రేషన్‌షాపుల్లో తనిఖీలు
కుదాభక్షుపల్లి గ్రామంలో లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న అధికారులు

మర్రిగూడ, జూన్‌ 18: మండలంలోని కుదాభక్షుప ల్లి, శివన్నగూడ, ఎరుగండ్లపల్లి, మర్రిగూడ గ్రామాల్లో రేషన్‌ షాపులను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే బియ్యం సరఫరా ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని డీలర్లు ఉద యం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పంపిణీ చేయాలన్నారు. రేషన్‌షాపుల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు.  

Updated Date - 2022-06-19T05:56:27+05:30 IST