బీజేపికి రాజీనామా..వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టిక్కెట్

ABN , First Publish Date - 2021-11-22T20:02:13+05:30 IST

బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రవీంద్ర అలియాస్ ఛోటు భోయర్‌ సోమవారంనాడు కాంగ్రెస్‌..

బీజేపికి రాజీనామా..వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టిక్కెట్

నాగపూర్: బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రవీంద్ర అలియాస్ ఛోటు భోయర్‌ సోమవారంనాడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ బవన్‌కులే‌పై పోటీకి నిలిపేందుకు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో డాక్టర్ రవీంద్ర బీజేపీకి రాజీనామ చేశారు. రెండు లైన్ల తన రాజీనామా పత్రాన్ని బీజేపీ నాగపూర్ చీఫ్ ప్రవీణ్ డట్కేకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో డాక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి డాక్టర్ నితిన్ రౌత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ థాక్రే, పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ వెనువెంటనే ఆయనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.



Updated Date - 2021-11-22T20:02:13+05:30 IST