మా యాప్స్‌ని ఎందుకు నిషేధించారు?

ABN , First Publish Date - 2020-07-14T06:47:37+05:30 IST

భారత్‌లో 59 చైనా యాప్స్‌పై నిషేధానికి సంబంధించి.. ఇటీవలి సైన్యాధికారుల చర్చల్లో భాగంగా డ్రాగన్‌ దేశం ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడంలో భాగంగా జరిగిన ఈ చర్చల్లో...

మా యాప్స్‌ని ఎందుకు నిషేధించారు?

  • సైన్యాధికారుల చర్చలో భారత్‌కు చైనా ప్రశ్న

న్యూఢిల్లీ, జూలై 13: భారత్‌లో 59 చైనా యాప్స్‌పై నిషేధానికి సంబంధించి.. ఇటీవలి సైన్యాధికారుల చర్చల్లో భాగంగా డ్రాగన్‌ దేశం ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడంలో భాగంగా జరిగిన ఈ చర్చల్లో.. యాప్స్‌ విషయాన్ని చైనా ప్రస్తావించగానే.. భారత అధికారులు దీటుగా సమాధానం చెప్పినట్లు తెలిసింది.


‘‘దేశభద్రత, సార్వభౌమత్వం, సమగ్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ 59 యాప్స్‌ ద్వారా మా దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం లీకవుతోంది. దేశ భద్రతకూ ముప్పు ఉంది’’ అని చెప్పినట్లు సమాచారం. కాగా.. భారత్‌, చైనాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య మంగళవారం నాలుగో విడత చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కి పంపించడం.. లద్ధాఖ్‌లో పరిస్థితులపై చర్చించనున్నారు.

Updated Date - 2020-07-14T06:47:37+05:30 IST