చైనాకు మోదీ స్పష్టమైన సందేశం
ABN , First Publish Date - 2020-07-05T08:30:28+05:30 IST
తన లద్దాఖ్ పర్యటన ద్వారా ప్రధాని మోదీ చైనాకు స్పష్టమైన సందేశాన్నిచ్చారని పలువురు మాజీ సైనికాధికారులు, వ్యూహాత్మక వ్యవహారా ల నిపుణులు పేర్కొన్నారు. భారత్ లద్దాఖ్ పరిస్థితిని
న్యూఢిల్లీ: తన లద్దాఖ్ పర్యటన ద్వారా ప్రధాని మోదీ చైనాకు స్పష్టమైన సందేశాన్నిచ్చారని పలువురు మాజీ సైనికాధికారులు, వ్యూహాత్మక వ్యవహారా ల నిపుణులు పేర్కొన్నారు. భారత్ లద్దాఖ్ పరిస్థితిని ఉక్కుపిడికిలితో సరిచేస్తుందని సందేశమిచ్చిందని భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహా పేర్కొన్నారు. భారత్ తన సరిహద్దుల్ని కాపాడుకోవడంలో రాజీపడదని చైనాకు తెలిసేలా మోదీ చేశారని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు డా. లక్ష్మణ్ బెహరా స్పష్టం చేశారు.